"ఎమర్జెన్సీ" వాయిదా!

త్వరలో విడుదల కానున్న కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడింది.

Update: 2024-09-01 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో విడుదల కానున్న కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా వాయిదా పడింది. ఇప్పటి వరకు ఆ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ రాకపోవడమే దీనికి కారణం. దీంతో సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఎప్పుడు విడుదల కానున్నది అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ఓ ప్రకటన జారీ చేసింది. అయితే కంగనా తానే స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా అనౌన్స్ చేనప్పటి నుండి వివాదాలను ఎదుర్కొంటుంది. కంగనా ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పటి నుండి, ఇందిరా గాంధీ హత్య వరకు ఈ సినిమాలో ప్రస్తావించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సెన్సార్ నుండి అనుమతి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తే చంపేస్తామని బోర్డు సభ్యులను బెదిరించబట్టే.. వారు జాప్యం చేస్తున్నట్టు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వాపోయింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చేవరకు ఈ సినిమా ఇక థియేటర్లలోకి రానట్టే.   


Similar News