మీ హద్దుల్లో మీరు ఉండండి.. ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు ఫైర్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-21 09:14 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయ నాయకులతో పాటు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ.. ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దీనిపై విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయంగా చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఘర్షణలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు థాంక్యూ)’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారడంతో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.

ఈ మేరకు ‘ప్రకాష్ రాజ్.. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంతి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ ఇప్పటికే జరిపిస్తున్నారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి’ అంటూ మంచు విష్ణు ప్రశాష్ రాజ్‌‌కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు.

For Vishnu Manchu tweet : https://x.com/iVishnuManchu/status/1837389115433930894



 


Tags:    

Similar News