డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ ‘కల్కి’ పార్ట్ 3 షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

దేశ వ్యాప్తంగా ‘కల్కి 2898AD’ మూవీ మానియా కొనసాగుతోంది.

Update: 2024-07-06 09:02 GMT

దిశ, సినిమా: దేశ వ్యాప్తంగా ‘కల్కి 2898AD’ మూవీ మానియా కొనసాగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుని భారీ కలెక్షన్లు రాబడుతోంది. అంతే కాకుండా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తాజాగా 10 రోజుల్లో రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘బాక్సాఫీస్ ఆన్ ఫైర్’ అనే క్యాప్షన్ ఇచ్చి రూ. 800 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలిపారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ. 800 కోట్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి మూడో సినిమాగా నిలిచింది. దీంతో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ సందర్భంగా కల్కి 2 గురించి చెప్తూనే.. పార్ట్ 3పై షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘కల్కి 2898AD’ అనేది చాలా పెద్ద సినిమా. పార్ట్ 1 లో 40 శాతం చూపించాము. ఇక పార్ట్‌లో 60 శాంత చూపించాలి. సెకండ్ పార్ట్‌లో మరో ప్రపంచం చూపించబోతున్నాము’ అనే చెప్తూనే.. ‘క్లైమాక్స్‌లో పార్ట్ 2పై ఆసక్తిని కలిగిస్తూ, కల్కి యూనివర్స్ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ కథ అంతా రెండో భగంలోనే ముగుస్తుంది. పార్ట్ 3 ఉండదు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంటే.. పార్ట్ 3 కూడా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్, నెటిజన్లు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో.. దీపిక పదుకుణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితర స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.


Similar News