నయనతారతో డైరెక్టర్ మారుతి వివాదం.. వెంకటేష్లాంటి సీనియర్ని కూడా ఆమె లెక్కచేసేది కాదంటూ
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్గా, కో ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత డైరెక్టర్గా మారి చిన్న సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నారు.
దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్గా, కో ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత డైరెక్టర్గా మారి చిన్న సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నారు. తన సినిమాలతో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశాడు. కేవలం డైరెక్టర్గానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా మారుతి రాణించారు. యూత్కి నచ్చే కథాంశాలతో సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్తో 'ది రాజా సాబ్' అనే చిత్రాన్ని చేస్తున్నారు మారుతి. సాహో, సలార్, కల్కి వంటి సినిమాలతో పక్కా మాస్ హీరోగా మారిన ప్రభాస్ను మన పాత డార్లింగ్లా చూపిస్తానంటున్నారు మారుతి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు పోకుండా సౌమ్యుడు అని పేరు తెచ్చుకున్న మారుతికి, ఒక హీరోయిన్కి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అది చిలికి చిలికి గాలివానగా మారింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆ వివాదం గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. నయనతార హీరోయిన్గా, వెంకటేష్ హీరోగా రూపొందిన చిత్రం 'బాబు బంగారం' . ఈ మూవీ షూటింగ్ సమయంలో నయనతార ఏ విషయంలోనూ యూనిట్కి సహకరించేది కాదు. నేను అప్పటికి పెద్ద డైరెక్టర్ని కాకపోవచ్చు. నన్ను గౌరవించకపోయినా ఫర్వాలేదు. వెంకటేష్లాంటి సీనియర్ని కూడా ఆమె పట్టించుకునేది కాదు.
ఎంతో ఓపికగా భరించిన నేను ఒకసారి ఆమెతో ఈ విషయమై వాగ్వాదానికి దిగాను. దాంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఇంకా ఆ సినిమాకి సంబంధించి ఒక పాట బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేయడానికి రమ్మని అడిగాను. తను వేరే సినిమాలతో బిజీగా ఉన్నానని, డేట్స్ ఎడ్జస్ట్ చెయ్యలేనని చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం' అని వివరించారు.