22 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్‌.. ఖుషీలో సినీ ప్రియులు

సంగీత, సోనాలీ బింద్రే, శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘ఖడ్గం’.

Update: 2024-10-05 11:57 GMT

Full View

దిశ, సినిమా: సంగీత, సోనాలీ బింద్రే, శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించగా.. 2002లో థియేటర్స్‌లో విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఎమోషన్స్‌తో మల్టీ జానర్‌లో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ వచ్చి 22 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రతి ఏడాది ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే‌లకు టీవీల్లో ప్రసారం అవుతూ అలరిస్తోంది.

తాజాగా, ‘ఖడ్గం’ సినిమాను 22 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లో మేకర్స్ రీరిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 18న విడుదల కాబోతుండటంతో.. ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో హీరో శ్రీకాంత్ పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘జనరేషన్స్ మారినా పేట్రియాటిక్ సినిమాల్లో అన్నిటిలో ఖడ్గం గొప్పది. అసలు ఖడ్గం మూవీలో నిర్మాత మధు మురళి మొదట నన్ను వద్దు అన్నారు కానీ వంశీ ధైర్యం చేసి ఆయనను ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్‌లో ఈ చిత్రం మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Similar News