20 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కాంబో రిపీట్.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్ కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా 2003లో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-07 09:14 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్ కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా 2003లో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ సరసన భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ ‘బటర్‌ఫ్లై’‌లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాజాగా, భూమిక 20 ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే భూమిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న ‘యుఫోరియా’ పోస్టర్‌ను షేర్ చేసింది. దీంతో ఈ మూవీలో ఆమె కీలక పాత్రలో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు. అలాగే ‘యుఫోరియా’కు సంబంధించిన విషయాలు చెప్పాలని అడుగుతున్నారు. అయితే ఈ సినిమా విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండగా.. దీనిని నిలిమా గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు (అక్టోబర్ 7) విడుదల కాబోతుంది.

 


Similar News