దేవర సినిమా టికెట్ రేట్లు, షోల పెంపునకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం

Update: 2024-09-21 08:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : నంద‌మూరి అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తెలుగులో తొలిసారిగా నటిస్తున్న ఈ క్రేజీ మూవీ ఈ సెప్టెంబ‌ర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏపీ ప్రభుత్వం దేవర సినిమా టికెట్ రేట్లు, షోల పెంపునకు అనుమతినిచ్చింది. ప్రస్తుత టికెట్ రేట్ల కంటే అదనంగా 14 రోజుల సింగిల్ స్క్రీన్ థియేటర్ అప్పర్ క్లాస్ - 110/-గా, లోయర్ క్లాస్ - 60/-రూపాయలుగా, మల్టీప్లెక్స్ - 135/- రూపాయలకు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా రిలీజ్ రోజు అర్ధరాత్రి 12 గంటల షో తో 6 షోలకు.. ఆ తర్వాత 9 రోజులు 5 షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు, షోల పెంపుకు అనుమతినిస్తుందని చిత్ర నిర్మాణ బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.


Similar News