తెలుగు రాష్ట్రాలకు అక్కినేని కుటుంబం విరాళం

తెలుగు రాష్ట్రాలకు అక్కినేని కుటుంబం వరద సాయం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించారు.

Update: 2024-09-04 09:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలకు అక్కినేని కుటుంబం(Akkineni family) వరద సాయం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా తెలియజేశారు. ప్రజలకు తక్షణ సహాయం చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నట్లు తెలిపారు. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ఇండస్ట్రీ(Industry) నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలో సాయం అందింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున రెండు కోట్లు ప్రకటించారు. ప్రభాస్ సైతం రెండు కోట్లు అందించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి, జూనియర్ ఎన్టీఆర్ కోటి, మహేశ్ బాబు కోటి, అల్లు అర్జున్ కోటి సహా అనేక మంది విరాళాలు ప్రకటించారు.

More News : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. మొత్తంగా రూ.6 కోట్ల విరాళం


Similar News