Sai Dharam Tej: హాస్పిటల్ బెడ్‌పై బోరున ఏడుస్తున్న సాయి ధరమ్ తేజ్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు.

Update: 2024-09-27 06:22 GMT

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. ఈ మలయాళ బ్యూటీ ‘యాక్షన్’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సత్యదేవ్ సరసన ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ’ వంటి మూవీస్‌ చేయడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఐశ్వర్య అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. అందులో సెలైన్ పెట్టుకుని హాస్పిటల్ బెడ్‌పై ఉంది. అలాగే కొన్ని బోరున ఏడుస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఐశ్వర్యకు ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు.

Full View


Similar News