రజనీకాంత్‌తో అనవసరంగా నటించా.. హీరోయిన్ మమతా మోహన్ దాస్ సంచలన కామెంట్స్!

టాలీవుడ్ నటి మమత మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరియర్ బిగినింగ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-06-19 03:49 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మమత మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరియర్ బిగినింగ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుండగానే అనుకోకుండా క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత టాలీవుడ్ ను వదిలి కేవలం తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విశాల్‌తో ‘శిలపతికారం సినిమాలో, విజయ్ సేతుపతితో మహారాజా సినిమాలో నటించింది మమతా మోహన్ దాస్.

అయితే మహారాజా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్లొన్న ఈ బ్యూటీ రజనీకాంత్ సినిమా కుసేలన్ పై హాట్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుసేలన్‌ మూవీలో ఓ పాట కోసం రజనీతో ఒప్పందం కుదుర్చుకుని 2 రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లి కష్టపడి సాంగ్ చేసాను. అయితే ఆ సినిమాలో నేను చేసిన పార్ట్ మొత్తం డిలీట్ అయింది. కేవలం ఆ పాటలో ఒక్క సెకను మాత్రమే కనిపిస్తానని.. అది చూసిన నాకు అసలు కుసేలన్ సినిమాలో ఎందుకు నటించానో అనిపించిందని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపై ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News