టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే బోనాలకు గుర్తింపు.. తలసాని కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతి భద్రతలను పటిష్టం చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం తలసాని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించడానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కాగా, ఆదివారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు బోనాలతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ […]

Update: 2021-07-31 23:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతి భద్రతలను పటిష్టం చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం తలసాని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించడానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కాగా, ఆదివారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు బోనాలతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Tags:    

Similar News