మహేశ్ బాబు ‘ఒక్కడు’ సీక్వెల్‌పై ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఒక్కడు’ సినిమా టాలీవుడ్‌లో కొల్లగొట్టిన రికార్డుల గురించి తెలిసిందే. గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను ఎం.ఎస్. రాజు నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కర్నూలులో కబడ్డీ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన అజయ్ అనే యువకుడు.. కర్నూలునే గడగడలాడిస్తున్న ఫ్యాక్షనిస్ట్ ఓబుల్‌రెడ్డిని నగర నడిబొడ్డున ఉతికారేసి, తను బలవంతంగా పెళ్లి చేసుకుందామని అనుకున్న స్వప్న అనే అమ్మాయిని కాపాడటమే కథ. కమర్షియల్ హంగులు జోడించి తీసిన సినిమా […]

Update: 2021-01-02 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఒక్కడు’ సినిమా టాలీవుడ్‌లో కొల్లగొట్టిన రికార్డుల గురించి తెలిసిందే. గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను ఎం.ఎస్. రాజు నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కర్నూలులో కబడ్డీ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన అజయ్ అనే యువకుడు.. కర్నూలునే గడగడలాడిస్తున్న ఫ్యాక్షనిస్ట్ ఓబుల్‌రెడ్డిని నగర నడిబొడ్డున ఉతికారేసి, తను బలవంతంగా పెళ్లి చేసుకుందామని అనుకున్న స్వప్న అనే అమ్మాయిని కాపాడటమే కథ. కమర్షియల్ హంగులు జోడించి తీసిన సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ కాగా.. ఈ చిత్రం సీక్వెల్ గురించి లేటెస్ట్ చిట్ చాట్‌లో ఎం.ఎస్. రాజును ప్రశ్నించారు అభిమానులు. మహేశ్‌తో మీరు చేసే నెక్స్ట్ మూవీ ‘ఒక్కడు’ సీక్వెలే కదా! అని ప్రశ్నించగా.. వచ్చే నెలలో చెప్తానని సమాధానమిచ్చారు నిర్మాత.

Tags:    

Similar News