గజ ఈతగాళ్లు కావాలి: కామారెడ్డి కలెక్టర్

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 226 చెరువులు ఉన్నాయని.. వాటిలో ఇంతవరకు 77 చెరువులు పూర్తిగా నిండాయని, ఈ నేపథ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జనహిత భవనంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లోని ముంపు ప్రాంతాలను అధికారులు గుర్తించి, అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా […]

Update: 2020-08-16 03:06 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 226 చెరువులు ఉన్నాయని.. వాటిలో ఇంతవరకు 77 చెరువులు పూర్తిగా నిండాయని, ఈ నేపథ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జనహిత భవనంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

పట్టణాలు, గ్రామాల్లోని ముంపు ప్రాంతాలను అధికారులు గుర్తించి, అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూడాలన్నారు. గ్రామస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. చెరువుల కట్టలు, అలుగులను నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాల్లో కూలిపోయే ఇండ్లను గుర్తించాలని, వాటిలో నివాసం ఉండే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే విధంగా చూడాలన్నారు.

గజ ఈతగాళ్లు వివరాలు సేకరించాలని కోరారు. చెరువులు తెగిపోయే వాటిని గుర్తించి ముందుగా ఇసుక బస్తాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను, పూర్తిగా కూలిన వాటి వివరాలు ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులకు గ్రామస్థాయి అధికారులు తెలియజేయాలని తెలిపారు. తప్పిదాలు జరగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని హెచ్చరించారు. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ముందుగానే ఆ గ్రామాలను గుర్తించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీవో నరేందర్, నీటిపారుదల శాఖ ఈఈ బన్సీలాల్, డీపీవో నరేష్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News