బండి సంజయ్ సంస్కారహీనుడు: కడియం

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: పాలకులను, ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు తిడుతున్న బండి సంజయ్ సంస్కారహీనుడు అని కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్‌పూర్, వేలేరు మండల కేంద్రాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం బెలిదే వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎన్ని ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కోచ్ […]

Update: 2021-03-10 06:30 GMT

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: పాలకులను, ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు తిడుతున్న బండి సంజయ్ సంస్కారహీనుడు అని కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్‌పూర్, వేలేరు మండల కేంద్రాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం బెలిదే వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎన్ని ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ హామీలు, రావలసిన నిధులను బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వలేదన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించి కేంద్ర ప్రభుత్వ నిర్మిస్తుందని.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించడంలో వివక్ష చూపుతుందన్నారు. ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు తిడుతున్న బండి సంజయ్ సంస్కారహీనుడు అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు నోరు విప్పితే సంజయ్ సమాజంలో తలెత్తుకుని తిరగలేరన్నారు.

Tags:    

Similar News