IGST కమిటీలో మంత్రి హరీశ్‌రావు‌కు చోటు

దిశ, వెబ్ డెస్క్ :రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఐజీఎస్టీ (సమగ్ర వస్తు, సేవల పన్ను) కమిటీలో చోటు దక్కింది. ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన మంత్రుల బృందంలో మార్పులు చేసిన జీఎస్టీ మండలి ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. ఇందులో తాజాగా మంత్రి హరీశ్‌రావుకు చోటు లభించింది. ఈ కమిటీకి బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా, ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం, సంబంధిత అంశాలపై గతేడాది డిసెంబరులో కమిటీ ఏర్పాటు […]

Update: 2020-07-22 21:53 GMT

దిశ, వెబ్ డెస్క్ :రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఐజీఎస్టీ (సమగ్ర వస్తు, సేవల పన్ను) కమిటీలో చోటు దక్కింది. ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన మంత్రుల బృందంలో మార్పులు చేసిన జీఎస్టీ మండలి ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. ఇందులో తాజాగా మంత్రి హరీశ్‌రావుకు చోటు లభించింది.
ఈ కమిటీకి బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా, ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం, సంబంధిత అంశాలపై గతేడాది డిసెంబరులో కమిటీ ఏర్పాటు కాగా, ఇప్పుడు దానిలో మార్పులు చేసినట్టు జీఎస్టీ కార్యాలయం వెల్లడించింది.

Tags:    

Similar News