లోకల్ వార్ సక్సెస్‌.. ఫుల్లు ఖుషీగా ‘నిమ్మగడ్డ’

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని అధిగమించి ఈసీ పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫుల్లు ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం తనకు వ్యతిరేకంగా మారిన సమయంలో సుప్రీం అనుమతితో నిమ్మగడ్డ అందరినీ తన దారికి తెచ్చుకున్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఏపీ ప్రభుత్వంపై మరోసారి పైచేయి సాధించారు. కరోనా సమయంలోనూ […]

Update: 2021-02-09 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని అధిగమించి ఈసీ పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫుల్లు ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ యంత్రాంగం తనకు వ్యతిరేకంగా మారిన సమయంలో సుప్రీం అనుమతితో నిమ్మగడ్డ అందరినీ తన దారికి తెచ్చుకున్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఏపీ ప్రభుత్వంపై మరోసారి పైచేయి సాధించారు. కరోనా సమయంలోనూ 81.78 శాతం పోలింగ్ జరగడంతో పాటు అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 ఓటింగ్ శాతం నమోదు కావడం సంతోషంగా ఉందని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News