దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు

దిశ,మేడ్చల్ : ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అనే ‘దిశ’ పత్రికలో బుధవారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని బండ మాదారం గ్రామంలోని పెద్ద చెరువు లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ పవన్ చంద్ మాట్లాడుతూ గ్రామాల్లోని ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతు కనపడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. తమ గ్రామంలోని విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించేందుకు రైతులు […]

Update: 2021-05-26 08:26 GMT

దిశ,మేడ్చల్ : ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అనే ‘దిశ’ పత్రికలో బుధవారం వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మండలంలోని బండ మాదారం గ్రామంలోని పెద్ద చెరువు లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ పవన్ చంద్ మాట్లాడుతూ గ్రామాల్లోని ఎక్కడైనా విద్యుత్ తీగలు వేలాడుతు కనపడితే వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. తమ గ్రామంలోని విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించేందుకు రైతులు దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News