సూర్యప్రభ వాహనంపై తిరుమల వెంకన్న దర్శనం

Update: 2024-10-10 07:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమ‌ల‌లో వైభ‌వంగా జ‌రుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన‌ గురువారం శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై విహారించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉద‌యం బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగిన శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని గోవింద నామ స్మరణలతో పులకించారు. మాఢ వీధుల్లో భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా వాహనసేవ సాగింది. సూర్యప్రభ వాహన సేవ ఆయురారోగ్యాలు, విద్య, సంతానం ప్రాప్తింప‌జేస్తుంద‌ని భక్తుల న‌మ్మకం.

వాహన సేవలో పెద్ద జీయ‌ర్‌స్వామి, చిన్న జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు దంప‌తులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రభృతులు పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవార చంద్రప్రభ ‌వాహనంపై భ‌క్తుల‌ను అనుగ్రహించనున్నారు. 

Tags:    

Similar News