చంద్రప్రభ వాహనంపై విహరించిన తిరుమలేశుడు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2024-10-10 15:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజైన గురువారం రాత్రి మలయ్యప్పస్వామి చంద్రప్రభ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించారు. కాగా ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి.. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇచ్చాడు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు, అర్చకులు ఘనంగా చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. కాగా నేడు శ్రీనివాసుడు దర్బార్ కృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, గోవిందుని నామాస్మరణతో పులకితులయ్యారు.   


Similar News