షాకింగ్ ఘటన.. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి

కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇడ్లీ తింటూ ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కేరళలోని వలయార్‌లో శనివారం ఓ పండుగ సందర్భంగా ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు.

Update: 2024-09-15 15:25 GMT

దిశ,వెబ్‌డెస్క్:కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇడ్లీ తింటూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని వలయార్‌లో శనివారం ఓ పండుగ సందర్భంగా ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 50 ఏళ్ల వ్యక్తి పాల్గొన్నాడు.  పోటీలో పాల్గొన్న సమయంలో ఆ వ్యక్తి ఇడ్లీ తింటుండగా ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి గొంతులోంచి ఇడ్లీని బయటకు తీశారు. కానీ ఆ వ్యక్తి ఆరోగ్యం అప్పటికే క్షీణించడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.


Similar News