బైక్‌పై వచ్చి నగదు చోరీ

ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఇద్దరు చోరీకి పాల్పడిన

Update: 2024-09-17 11:28 GMT

దిశ, కథలాపూర్ : ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఇద్దరు చోరీకి పాల్పడిన సంఘటన కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన పుర్రె గంగ నర్సయ్య అనే వ్యక్తి కథలాపూర్ యూనియన్ బ్యాంకు నుంచి రూ. 1,68,000/- డ్రా చేసి బైక్ కవర్ లో పెట్టి ప్రక్కనున్న బేకరీ షాప్ లోకి వెళ్లి వచ్చే క్రమంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి బైక్ కవర్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లి నట్లు తెలిసింది. బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను సీసీ కెమెరా ల ద్వారా పరిశీలించి పట్టుకునే పనిలో పడ్డారు.


Similar News