వాసాలమర్రిలో ఘోరం.. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఘోరం జరిగింది. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందారు.

Update: 2024-05-16 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఘోరం జరిగింది. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహిపాల్ రెడ్డి(39), అతని భార్య నవిత ఏదో పనిమీద బైకుపై తుర్కపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఆపై కొద్దిదూరం ఆ బైకును ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో బైకు పూర్తిగా దగ్ధమై మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బైకుపైనే ఉన్న మహిపాల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిది సిద్దిపేట జిల్లా ములుగుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News