వృద్ధురాలి నోరు మూసి దారుణం.. ఆ ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

ఓ వృద్ధురాలి నోరు మూసి దొంగలు బంగారు నగలు ఎత్తుకెళ్లిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.

Update: 2024-10-11 08:29 GMT

దిశ, యాచారం : ఓ వృద్ధురాలి నోరు మూసి దొంగలు బంగారు నగలు ఎత్తుకెళ్లిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. సీఐ లిక్కీ కృష్ణంరాజు, తెలిపిన వివరాల ప్రకారం.. ఆకుల మైలారం గ్రామానికి చెందిన దేవరశెట్టి సుమతమ్మ, (80) ఇంట్లో నిద్రస్తుంది. ఆ సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు డోరు కొట్టడంతో తలుపు తీసి ఎవరు కావాలని అడుగుతున్న క్రమంలో ఇద్దరిలో ఒకరు వృద్ధురాలి నోరు మూయగా మరొకరు కట్టర్‌తో 4 తులాల బంగారు గాజులను, మెడలో ఉన్న రెండు తులాల పుస్తెలతాడును కట్ చేసుకోని పారిపోయారు. మొత్తం ఆరు తులాల బంగారు నగలను దొంగలు దోచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ లిక్కీ కృష్ణంరాజు తెలిపారు. కాగా, ఆకుల మైలారం గ్రామంలో వరస దొంగతనాలతో గ్రామంలోని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పోలీసులు నిఘాను ప్రతిష్టం చేసి దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News