యువతిని మోసం చేసిన యువకుడు రిమాండ్..

ప్రేమించానని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిని శంకర్పల్లి పోలీసులు శనివారం రిమాండ్ కి తరలించారు.

Update: 2023-06-03 13:51 GMT

దిశ, శంకర్పల్లి: ప్రేమించానని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిని శంకర్పల్లి పోలీసులు శనివారం రిమాండ్ కి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి శ్రీరాంనగర్ కాలనీకి చెందిన నారెగూడెం కార్తీక్ రెడ్డి తమ ఇంట్లో కిరాయికి ఉన్న యువతికి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని బలవంతం చేసి పలుమార్లు శారీరకంగా లొంగతీసుకున్నాడు.

దీంతో యువతి గర్భం దాల్చి ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా అమ్మాయి పెళ్లి చేసుకోమని కార్తీక్ రెడ్డిని కోరగా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో బాధిత యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని శనివారం కార్తీక్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News