పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది.. ఇంటర్ విద్యార్థిని మృతి

ప్రేమోన్మాది దాడిలో ఇంటర్ విద్యార్థి(Inter student)ని మృతిచెందింది. ఈ ఘటన కడప(Kadapa) జిల్లాలోని బద్వేల్‌లో చోటుచేసుకుంది.

Update: 2024-10-20 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమోన్మాది దాడిలో ఇంటర్ విద్యార్థి(Inter student)ని మృతిచెందింది. ఈ ఘటన కడప(Kadapa) జిల్లాలోని బద్వేల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బద్వేలులోని రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్థిని స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే కాలనీకి చెందిన విఘ్నేశ్‌ అనే యువకుడు తరచూ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఇటీవలే విఘ్నేశ్‌కు వివాహం అయినా కూడా విద్యార్థిని వెండపడటం ఆపలేదు. శనివారం మధ్యాహ్నం కళాశాలలో ఉన్న విద్యార్థినికి ఫోన్‌ చేసి కలవాలని చెప్పాడు. ఈరోజు తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో చేసేదేంలేక బాలిక అతన్ని కలిసింది.

బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ఫ్లైవుడ్‌ పరిశ్రమ సమీపంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. స్థానిక కూలీలు బాలికను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలికను కడప రిమ్స్‌(Kadapa Rims)కు తరలించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.


Similar News