రోడ్డుపై నిలుచున్న యువకుడిని ఢీకొట్టిన కంటైనర్​

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన యువకుడు మృతి చెందాడు.

Update: 2024-09-28 13:31 GMT

దిశ, కారేపల్లి : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పెద్దమడెంపల్లికి చెందిన ఎజ్జు రవీందర్ తేజ (24) ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులో హైదరాబాద్ వెళ్తున్నాడు. మార్గమధ్యలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ సమీపంలో రవీందర్ తేజ ప్రయాణిస్తున్న బస్సు మరమ్మతుకు గురైంది. దీంతో రవీందర్ తేజ డ్రైవర్​తో పాటు కిందకు దిగగా వెనుకనుండి వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News