పల్టీ కొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి

ట్రాక్టర్ పల్టీ కొట్టి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం వేలేరుపాడు మండలం భూ దేవి పేట గ్రామంలో జరిగింది.

Update: 2024-10-06 07:49 GMT

దిశ, కుక్కునూరు/వేలేరుపాడు:ట్రాక్టర్ పల్టీ కొట్టి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం వేలేరుపాడు మండలం భూ దేవి పేట గ్రామంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నకిరికంటి నరసింహారావు అనే రైతు దగ్గర బుర్రతోగు గ్రామానికి చెందిన చిచ్చడి వంశీ (16) అనే మైనర్ బాలుడు వ్యవసాయ పనికి వెళ్ళడం జరిగింది.‌ ఈ క్రమంలో ట్రాక్టర్ లో ట్యాంక్ ద్వారా నీళ్ళు తీసుకొని వెళుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ట్రాక్టర్ కింద పడిన వంశీ అక్కడిక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో శనివారం రాత్రి 10 గంటల వరకు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న కుక్కునూరు సీఐ రమేష్, వెలేరుపాడు ఎస్సై కెవి రామారావు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు.‌ రైతు నర్సింహారావు రూ 3.50 లక్షలు ఇస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ నడిపిన వ్యక్తి కూడా సరిగ్గా డ్రైవింగ్ రాని మైనర్ బాలుడే అని చెబుతున్నారు


Similar News