మోహన్​ బాబు ఇంట్లో చోరీ చేసిన నిందితుడు అరెస్ట్​

మోహన్​ బాబు ఇంట్లో రూ.10 లక్షలు దొంగతనానికి పాల్పడ్డ హౌజ్​ బాయ్​ను పహాడిషరీప్​ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్​కు తరలించారు.

Update: 2024-09-25 16:32 GMT

దిశ, బడంగ్​ పేట్ : ​ మోహన్​ బాబు ఇంట్లో రూ.10 లక్షలు దొంగతనానికి పాల్పడ్డ హౌజ్​ బాయ్​ను పహాడిషరీప్​ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్​కు తరలించారు. నిదితుడి వద్ద నుంచి రూ.7 లక్షల 36 వేల 400లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహాడిషరీఫ్​ ఇన్​స్పెక్టర్​ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జల్​పల్లిలోని మంచు టౌన్​ షిప్​ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా సినీనటుడు మోహన్​బాబు కుటుంబం నివసిస్తుంది. మూడేళ్ల క్రితం మోహన్​ బాబు వద్ద కార్యదర్శిగా కిరణ్​కుమార్​ తేజ్​ విధులు నిర్వహిస్తున్నాడు. గత ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రవంకపల్లి విలేజ్​కు చెందిన వడితె గణేష్​ నాయక్​ (24) మోహన్​ బాబు ఇంట్లో హౌజ్​ బాయ్​గా చేరాడు.

     మొదట్లో గణేష్​ నమ్మకంగానే ఉన్నాడు. కాగా ఈ నెల 22వ తేదీన తిరుపతిలోని ఎం‌బీ‌యూ యూనివర్సిటీ నుంచి కార్యదర్శి కిరణ్​కుమార్​ తేజ్​, గణేష్​ నాయక్​లు రూ.10 లక్షలను తీసుకుని జల్ పల్లి లోని మంచు టౌన్ షిప్ కు వచ్చారు. అక్కడ తన గదిలో కిరణ్​కుమార్​ డబ్బులు పెట్టి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి చూసేసరికి అక్కడ రూ.10 లక్షలు కనిపించలేదు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా గణేష్​ నాయక్​ ఆయన గదిలోకి వచ్చి వెళ్లినట్టు కనిపించడంతో పాటు అతను పరారైనట్టు గుర్తించారు. దాంతో వెంటనే జరిగిన విషయాన్ని కార్యదర్శి కిరణ్​ యజమాని మోహన్​బాబుకు వివరించారు.

    దీంతో మోహన్​ బాబు సూచన మేరకు కిరణ్​కుమార్​ ఈనెల 23వ తేదీన రాత్రి 10 గంటలకు పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పహాడిషరీఫ్​ పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న గణేష్​ నాయక్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 7,36,400 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులు జల్సాలకు ఉపయోగించినట్లు గణేష్​ నాయక్​ పోలీసుల విచారణలో నేరాణ్ని అంగీకరించాడు. గణేష్​ నాయక్​ను అరెస్ట్​ చేసి బుధవారం పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఈ కేసును పహాడిషరీప్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News