కోణార్క్ ఎక్స్​ప్రెస్​లో గంజాయి పట్టివేత

మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి తెలిపారు.

Update: 2024-10-15 13:27 GMT

దిశ, మధిర : మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి తెలిపారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని మధిర రైల్వే స్టేషన్ లో రోజు వారి తనిఖీలలో భాగంగా రెండో నెంబర్ ప్లాట్​ఫాంపై అగి ఉన్న భువనేశ్వర్ నుండి ముంబై సెంట్రల్ వెళ్లే కోణార్క్ ఎక్స్​ప్రెస్​లో మంగళవారం సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా 10 కేజీల గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఎవరనేది తెలియలేదని చెప్పారు. ఈ తనిఖీల్లో సిబ్బంది ముస్తఫా, రియాజ్ గోపయ్య, గోపి, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Tags:    

Similar News