Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు యువకులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన విషాద ఘటన అనకాపల్లి జిల్లా (Anakapally District)లో నక్కపల్లి జాతీయ రహదారిపై (Anakapally National Highway) బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-09-26 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన విషాద ఘటన అనకాపల్లి జిల్లా (Anakapally District)లో నక్కపల్లి జాతీయ రహదారిపై (Anakapally National Highway) బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని గొడిచెర్ల (Godicherla)కు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు (24), ఆవాల నవీన్‌ (18) దేవవరానికి చెందిన దమ్ము సీతయ్య ముగ్గురు కలిసి బైక్‌పై వేంపాడు (Vempadu)లోని ఓ దాబాలో టిఫిన్‌ చేసేందుకు వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వారి బైక్ ఉద్దండపురం (Uddandapuram) శివారులోకి రాగానే అతివేగంతో ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. సీతయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నక్కపల్లి సీఐ కుమార స్వామి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన సీతయ్యను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కుమార స్వామి తెలిపారు. 


Similar News