కోరిక తీర్చలేదని హత్య..

కడవరకు తోడుంటా అని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట

Update: 2024-10-14 15:24 GMT

దిశ, వీర్నపల్లి : కడవరకు తోడుంటా అని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట మృత్యువుగా మారాడు. లైంగిక కోరికలు తీర్చలేదని కర్కషంగా హతమార్చాడు.ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడు రవిని సీఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేటలో అరెస్టు చేశారు. వివరాలను ఎస్ఐ ఎల్లయ్య గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీర్నపల్లి మండలం జవహర్లాల్ నాయక్ తండా కు చెందిన గుగులోత్ రవి భార్య సుశీలతో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గత కొద్ది రోజులుగా భార్య గుగులోత్ సుశీల పై అనుమానంతో వేదిస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి లైంగిక సంపర్కానికి సహకరించనందుకు తాడుతో ఆమె చనిపోయే వరకు గొంతు నులిమి చంపాడు.

అనంతరం నిందితుడు మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చి, ఉరి వేసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తాడుతో మృతదేహాన్ని పందిరి ఉరితీసేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. ఇంటి ముందు మంచం పై మృతదేహాన్ని పడుకోబెట్టి, ఇంటి తలుపులు వేసి పరారయ్యారు. 24 గంటలు గడవక ముందే నేరస్తుడిని పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీనిలో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నందుకు వీర్నపల్లి పోలీస్ సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించినట్లు సిఐ తెలిపారు.


Similar News