నెత్తురోడిన అశ్వారావుపేట - ఖమ్మం జాతీయ రహదారి..

అశ్వారావుపేట-ఖమ్మం జాతీయ రహదారి నెత్తురోడ్డింది.. ఆదివారం తెల్లవారుజాము నుండి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.

Update: 2025-03-23 05:28 GMT
నెత్తురోడిన అశ్వారావుపేట - ఖమ్మం జాతీయ రహదారి..
  • whatsapp icon

దిశ, దమ్మపేట : అశ్వారావుపేట-ఖమ్మం జాతీయ రహదారి నెత్తురోడ్డింది.. ఆదివారం తెల్లవారుజాము నుండి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా, గంటల వ్యవధిలోనే రెండు కిలోమీటర్ల దూరంలోనే గాంధీనగర్ గ్రామంలో మరో రోడ్డు ప్రమాదం జరిగి తల్లి కొడుకు మృతి చెందారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లి సరస్వతి (70), కొడుకు కృష్ణ (53) బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా గాంధీనగర్ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు సమాచారం అందించారు. ఖమ్మం- అశ్వారావుపేట జాతీయ రహదారి పై గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగి ముగ్గురు మరణించడంతో వాహనదారులు ఆ రోడ్డుగుండా వెళ్లాలంటే భయపడుతున్నారు.


Similar News