రెండు టీవీఎస్ మోపెడ్ వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి...

రెండు టీవీఎస్ మోపెడ్ వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పులిగిల్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది.

Update: 2023-05-14 17:01 GMT

దిశ, వలిగొండ : రెండు టీవీఎస్ మోపెడ్ వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పులిగిల్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కడవేరు వీరస్వామి తన భార్య కడవేరి విజయలక్ష్మి మనుమరాలతో కలిసి వెల్వర్తి గ్రామం నుండి యాదగిరిగుట్టలోని బంధువుల ఇంటికి తన టీవీఎస్ మోపెడ్ పై వెలుతున్నారు. పులిగిల్ల ఐకేపీ కేంద్రం వద్దకు రాగానే పులిగిల్ల గ్రామానికి చెందిన నక్కల యాదిరెడ్డి తన టీవీఎస్ మోపెడ్ పై అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో కడవేరు వీరస్వామి కింద పడగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఏఎస్సై శ్యాంసుందర్ రెడ్డి కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

Tags:    

Similar News