లారీ బీభత్సం.. యువకుడు మృతి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ జంగుపల్లి గ్రామాల మధ్య ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-10-16 14:14 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ జంగుపల్లి గ్రామాల మధ్య ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 25 బి 13 39 (హోండా యాక్టివా) నెంబర్ గల ద్విచక్ర వాహనంపై పేరాల వెంకటేశ్వరరావు, వేముల మణి ప్రసాద్, జక్కిరాజు జశ్వంత్ లు పెద్దాపూర్ నుండి భూపాల్ పల్లి కి జంగుపల్లి మీదుగా వెళ్తున్న క్రమంలో ఏపీ 20 టిబి 63 88 నెంబర్ గల లారీ భూపాలపల్లి నుండి ఏటూరునాగారం వైపు వస్తు ప్రమాదవశాత్తు పెద్దాపూర్ జంక్షన్ వద్ద ముగ్గురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో పేరాల వెంకటేశ్వరరావు (16) తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందగా వేముల మణి ప్రసాద్, జక్కిరాజు, జశ్వంత్ లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108 వాహనంలో వారిని ఆస్పత్రికి తరలించారు. వెంకటాపూర్ ఎస్సై సతీష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News