RS బ్రదర్స్‌పై ఐటీ పంజా.. ఏకకాలంలో రెండు రాష్ట్రాల్లో సోదాలు

ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్‌లలో ఐటీ సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 11 చోట్ల ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

Update: 2022-10-14 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్‌లలో ఐటీ సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 11 చోట్ల ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. RS బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు సంస్థ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, పొట్టి సత్యనారాయణ, టి.ప్రసాద్ రావు, అభినవ్, వెంకట్ సాయి, రాకేశ్, కేశవ్ గుప్త, రాజమౌళి, సురేశ్ ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని పలువురు రియల్ ఏస్టేట్స్ సంస్థల్లో జరిపిన సోదాల్లో ఈ ఎనిమిది మంది డైరెక్టర్ల లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇవాళ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూములతో పాటు డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. కాగా, ఒకే సమయంలో ఆంధ్రా, తెలంగాణ వ్యాప్తంగా పదిచోట్ల తనిఖీలు జరుగడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News