ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వంచనగిరిలో చోటుచేసుకుంది.

Update: 2024-10-16 02:27 GMT

దిశ, గీసుకొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వంచనగిరిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం దుగ్గొండి మండలం దేశాయిపెళ్లికి చెందిన కొల్లూరి నితిన్ అనే యువకుడు గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ గీసుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ఇటీవల కొల్లూరి నితిన్ అమ్మమ్మ మోర్తాల మధుర భాయి మరణించగా, తాత మోర్తాల నరసింగ రావుతో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంటకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News