భారీ గంజాయి పట్టివేత..ముగ్గురు అరెస్ట్..పరారీలో నలుగురు
దూల్పేట్, పూరాన్పూల్, జుమ్మెరాత్ బజార్ ప్రాంతాల్లో గంజాయి
దిశ,కార్వాన్ : దూల్పేట్, పూరాన్పూల్, జుమ్మెరాత్ బజార్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు దాడి చేశారు. ఎస్టీఎప్ టీంలీడర్ అంజి రెడ్డి ఆదేశాల మేరకు దాడి నిర్వహించి రెండు కేసుల్లో 2.310 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ రెండు కేసుల్లో మూడు మోటార్ సైకిళ్లు, మూడు ఫోన్ లను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజి రెడ్డి తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో జియా గూడ కు చెందిన జి.రాజు, వికాష్ జాదవ్, విఠల్ ఉన్నారు. దూల్పేట్కు చెందిన రవి కురీల్, యశ్వపాల్ సింగ్, రేఖా, దేవిలో ఉన్నారు. ఈ గంజాయిని పట్టుకున్న టీమ్లో సీఐలు మధుబాబు, గోపాల్, ఎస్సైలు సైదాలు,మధు ,హెడ్కానిస్టేబుళ్లు భాస్కర్రెడ్డి, అజీమ్, శ్రీధర్ , కానిస్టేబుళ్లు ప్రకాష్, రాకేష్, మహేష్లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.