హైవేపై ఘోర ప్రమాదం.. అక్కడిక్కడే ఆరుగురు మృతి

హైవేపై ఘోర ప్రమాదం.. అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2023-05-23 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైవేపై ఘోర ప్రమాదం.. అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణె-నాగ్‌పూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ట్రక్కును బస్సు వెగంగా ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందగా మరో 10 మంది వరకు గాయాల పాలైనట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి బస్సు వేగమే కారణమని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం.. స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News