విద్యుదాఘాతమా...ప్రమాదమా

కట్టెల కోసం పొలానికి వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలోని భగత్ వీడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-10-20 14:54 GMT

దిశ, కూసుమంచి : కట్టెల కోసం పొలానికి వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలోని భగత్ వీడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు నాయకన్ గూడెం గ్రామానికి చెందిన కిన్నెర శ్రీను (38) వ్యవసాయ కూలీ. కొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో కట్టెల కోసం పొలానికి వెళ్లి మృతి చెందాడు. బావిలో మృతదేహం లభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విద్యుత్ షాక్ తో మృతి చెందాడా? బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Tags:    

Similar News