హుజూరాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం.. డెంగీతో పదేళ్ల బాలిక మృతి

డెంగీ బారిన పడి పదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.

Update: 2024-09-30 07:45 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: డెంగీ బారిన పడి పదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రావుల వెంకటేశ్వర్లు కుమార్తె రిషిత (10) గత నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక వైద్యుడికి చూపించారు. అయినా జ్వరం ఏమాత్రం తగ్గకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ నిర్ధారణ అవ్వడంతో అప్పటికే రిషిత ఆరోగ్యం బాగా క్షిణించింది. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ప్లేట్‌లెట్స్ పూర్తిగా పడిపోవడం‌తో పాటు రిషితకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం మృతి చెందింది.  


Similar News