ఏసీబీ వలకు చిక్కిన కమ్యూనిటీ కో - ఆర్డినేటర్
జమ్మికుంట పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కమ్యూనిటీ కో - ఆర్డినేటర్ సురేష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మండలానికి వీవోఏ స్వప్న తన జీతం డబ్బులు ఇవ్వాలని సురేష్ ను కోరగా, లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులకు సమాచారం అందించింది. మంగళవారం సురేష్ కు డబ్బులు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.