కాలనీ అంతా దుర్వాసన...వెళ్లి చూడగా....

ఓ ఇంట్లో కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది.

Update: 2024-09-24 15:49 GMT

దిశ, తాండూరు : ఓ ఇంట్లో కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. దుర్వాసన రావడంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

    అప్పటి వరకు కాలనీలో దుర్వాసన రావడంతో అక్కడి వారంతా దానిపై దృష్టిసారించారు. అది ఓ ఇంట్లో నుంచి వస్తుందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అలీ రహమాన్ (38) అనే వ్యక్తి ఇంట్లో మృతి చెంది కుళ్లిపోయి కనిపించాడు. అలీ 3 రోజుల క్రితం నిద్రలోనే మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News