దసరా వేడుకల్లో అపశృతి.. విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..

దసరా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

Update: 2024-10-12 09:55 GMT

దిశ, మేడిపెల్లి : దసరా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృత్యువాత పడ్డ సంఘటన జగిత్యాల జిల్లా భీమారం మండలం రాగోజీపేట్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే దసరా పండగ పూట దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మహిషాసుర మర్దన కార్యక్రమం నిర్వహించారు.

ఈ క్రమంలోనే మహిషా శూరునికి నిప్పు పెట్టే ప్రయత్నంలో అక్కడే ఉన్న ట్రాన్ఫర్మ్ వైర్లు అరిసెల వెంకటేష్ (36) అనే యువకునికి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు వెంకటేష్ ను వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాప్సిటల్ కి తిసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. వెంకటేష్ మృతితో రఘోజీపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News