ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకిన తల్లి.. ఆ ఇద్దరి కోసం గాలింపు

ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో కానీ తన ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోవడానికి సిద్ధపడింది. ఈ క్రమంలో ఆ మహిళ బందర్ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది

Update: 2024-09-29 10:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో కానీ తన ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోవడానికి సిద్ధపడింది. ఈ క్రమంలో ఆ మహిళ బందర్ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్క్రూ బ్రిడ్జి దగ్గర బందర్ కాలువలో ఇద్దరు పిల్లలతో సహా ఆ తల్లి కాలువలోకి దూకింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్థానికులు గమనించి ఘటన స్థలానికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. కానీ ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయింది. మరోవైపు తల్లి కుమారుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News