బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి

లక్నో-గోరఖ్‌పూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో.. ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు.

Update: 2023-04-22 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: లక్నో-గోరఖ్‌పూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో.. ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. అలాగే ట్రక్కు గూడ్స్ క్యారియర్ బస్సుపై పడటంతో.. దాదాపు 40 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం అయోధ్య నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అంబేద్కర్ నగర్ వైపు వెళ్లేందుకు హైవేపై మలుపు తిరుగుతుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గురైన వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాలకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News