కన్స్యూమర్ కోర్టు కీలక తీర్పు : రైలులో చోరీ జరిగితే ఆ బాధ్యత రైల్వేదే..!

దిశ, వెబ్‌డెస్క్ : రైలులో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ఇందులో చాలా మంది వస్తువులను దొంగలు దోచుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే పోగొట్టుకున్న వస్తువులు విలువైనవి కాకపోతే.. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశామో అని ఊరుకుంటాం. అదే ఖరీదైన వస్తులు, డబ్బులు పోతే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తాం. కానీ పోగొట్టుకున్న వస్తువులకు ఎలా రాబట్టుకోవాలో తెలుసా..? అసలు పోయిన వస్తువులకు రైల్వే శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుసా..? ఓ […]

Update: 2021-08-27 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రైలులో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ఇందులో చాలా మంది వస్తువులను దొంగలు దోచుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే పోగొట్టుకున్న వస్తువులు విలువైనవి కాకపోతే.. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశామో అని ఊరుకుంటాం. అదే ఖరీదైన వస్తులు, డబ్బులు పోతే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తాం. కానీ పోగొట్టుకున్న వస్తువులకు ఎలా రాబట్టుకోవాలో తెలుసా..? అసలు పోయిన వస్తువులకు రైల్వే శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుసా..? ఓ కేసులో కోర్టు సైతం అదే తీర్పునిచ్చి ప్రయాణికురాలికి భారీ మొత్తంలో పరిహారం ఇప్పించింది. ఆ వివరాలను మీరూ తెలుసుకోండి..

హైదరాబాద్ నగరానికి చెందిన శీతల్‌ ముఖర్జీ బెంగళూరులో ఉంటున్న తన ఆడపడుచు నిశ్చితార్థానికి బంధువులతో కలిసి వెళ్లేందుకు 2017 ఆగస్టు 11న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 స్లీపర్‌ కోచ్‌లో 57, 58, 60, 62, 64, 69 బెర్త్‌లను రిజర్వ్‌ చేసుకున్నారు. నిశ్చితార్థానికి అవసరమైన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌, నగలు, రూ.3 లక్షలు సూట్‌కేసులో భద్రపరిచి తీసుకెళ్లారు. ఆ తర్వాతి రోజు బెంగళూరులో రైలు దిగి ఆడపడచు ఇంటికి వెళ్లి చూడగా.. సూట్‌కేసు కింది భాగానికి కన్నం వేసిన దుండగులు.. రూ.14.01లక్షలు విలువ చేసే నగలు, రూ.3 లక్షలు, పట్టుచీరలు దొంగిలించినట్లు గుర్తించారు.

ఈ చోరీపై అప్పట్లోనే శీతల్‌ ముఖర్జీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ కేసు ముందుకు సాగలేదు.. పోయిన సొత్తు రికవరీ కాలేదు. దీనిపై శీతల్‌ ముఖర్జీ హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కన్స్యూమర్ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అలాగే రైల్వే శాఖ బాధ్యతను గుర్తు చేసింది. రైలులో చోరీ జరిగితే దాని బాధ్యత రైల్వేదే అని స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికుడిని వినియోగదారుడిగా పరిగణించాలని, భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే వర్గాలదే అని తేల్చి చెప్పింది. అంతేకాకుండా చోరీకి గురైన బంగారు నగల మొత్తాన్ని చెల్లించాలని తీర్పు వెల్లడించింది. రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత కన్స్యూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చి ప్రయాణికురాలికి న్యాయం చేసింది. ఈ కేసులో బాధితురాలికి రూ.17 లక్షల పరిహారాన్ని ఇప్పించి సంచలనం సృష్టించింది.

Tags:    

Similar News