కాంగ్రెస్ ఎంపీపై బీజేపీ ఎంపీ భౌతికదాడి!

న్యూఢిల్లీ : పార్లమెంటులో బీజేపీ ఎంపీ జస్‌కౌర్ మీనా తనపై భౌతిక దాడికి పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ ఆరోపించారు. ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ఫిర్యాదు చేశారు. తాను దళిత మహిళ కాబట్టే ఇటువంటి దాడులకు తరుచుగా గురవుతున్నానా? అంటూ ప్రశ్నించారు. కాగా, ఈ పరిణామంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ పలవరించే బేటీ బచావో, బేటీ పడావో అంటే ఇదేనా? అంటూ నిలదీసింది. గతేడాది కూడా […]

Update: 2020-03-02 05:51 GMT

న్యూఢిల్లీ : పార్లమెంటులో బీజేపీ ఎంపీ జస్‌కౌర్ మీనా తనపై భౌతిక దాడికి పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ ఆరోపించారు. ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ఫిర్యాదు చేశారు. తాను దళిత మహిళ కాబట్టే ఇటువంటి దాడులకు తరుచుగా గురవుతున్నానా? అంటూ ప్రశ్నించారు. కాగా, ఈ పరిణామంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ పలవరించే బేటీ బచావో, బేటీ పడావో అంటే ఇదేనా? అంటూ నిలదీసింది. గతేడాది కూడా లోక్‌సభలో నిరసన చేస్తున్న రమ్య హరిదాస్‌పై మార్షల్స్ అనుచితంగా వ్యవహరించారని ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags : congress MP, bjp, manhandle, parliament, speaker Om Birla

Tags:    

Similar News