ఆ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్.. ముఖ్యమైన ఆదేశాలు జారీ

దిశ, స్టేషన్ ఘన్ పూర్: వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ బస్తీలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉంది, ఎంతమందికి వేస్తున్నారు? రెండో డోసు ఎంతమంది తీసుకోవాల్సి ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, వయసుకు […]

Update: 2021-10-09 04:03 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ బస్తీలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉంది, ఎంతమందికి వేస్తున్నారు? రెండో డోసు ఎంతమంది తీసుకోవాల్సి ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉన్నారా? లేరా? అనే విషయాన్ని అంగన్వాడీ టీచర్ల ద్వారా తెలుసుకోవడమే కాకుండా స్వయంగా పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ అమలు చేసి ఆరోగ్యవంతమైన పిల్లలుగా తీర్చిదిద్దాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి ఏ.మహేందర్, జిల్లా ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి, మండల ప్రత్యేక అధికారి నరసయ్య, ఎంపీడీవో కుమారస్వామి, స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్, డాక్టర్ రవి రాథోడ్, రమణ, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, శ్రీనివాస్ ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News