పుష్ప-3 ప్రకటించిన నిర్మాత

పాన్ ఇండియా క్రేజీ మూవీగా రాబోతున్న పుష్ప 2 కు కొనసాగింపుగా పుష్ప 3 కూడా ఉంటుందని నిర్మాత రవిశంకర్ ప్రకటించారు.

Update: 2024-10-24 11:34 GMT

దిశ, వెబ్ డెస్క్ :  పాన్ ఇండియా క్రేజీ మూవీగా రాబోతున్న పుష్ప 2 కు కొనసాగింపుగా పుష్ప 3 కూడా ఉంటుందని నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పుష్ప 3 ఉంటుందా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు నిర్మాత రవిశంకర్ సమాధానమిస్తూ పుష్ప 2కి కొనసాగింపుగా పార్ట్-3 ఉంటుందని ప్రకటించారు. పార్ట్-2 ఎండింగ్ లో కొనసాగింపునకు లీడ్ కూడా ఉంటుందని తెలిపారు. నవంబర్ లో పుష్ప-2 ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేస్తామని వాటి డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఈ మూవీ డిసెంబర్ 5న రానున్నట్లు విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప: ది రైజ్'. మైత్రీ మూవీ మేకర్స్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'పుష్ప: ది రూల్' తెరకెక్కుతోంది. అయితే పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే సుకుమార్ కూడా కథలో భారీ మార్పులు చేసి.. పార్ట్ 1కి మించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం ఏ మూవీకి లేని క్రేజ్ పుష్ప 2కి ఉండటంతో ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 1000కోట్లు జరిగిందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బహుబలి చిత్రానికి మాత్రమే ఇలాంటి బిజినెస్ జరిగిందట. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్ప 2 రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


Similar News