దయచేసి రూ.5 అయినా ఎక్స్‌ట్రా ఇవ్వండి కానీ.. బేరం చేయకండి.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-19 02:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renudesai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్‌తో విడాకుల తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తన పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఓ ముసలావిడ(old lady) కూరగాయలు అమ్ముతూ ఉంది. అయితే ఆమెకు ఎవరైన ఎక్స్‌ట్రా మనీ ఇచ్చారో ఏమో కాబోలు ఆమె నవ్వుతూ మనీ తీసుకుంటుంది. ఈ వీడియోకు రేణుదేశాయ్.. అవసరమైతే రూ.5 నుంచి రూ.10 అదనంగా ఇవ్వండి కానీ, వాళ్ల దగ్గర బేరం ఆడకండి, వారు బ్రతకడానికి మాత్రమే పని చేస్తున్నారు. దాచిపెట్టుకోవడానికి కాదు అనే క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా రోడ్ సైడ్ కూరగాయలు(Vegetables), తినుబండారాలు(food) అమ్మే వారి దగ్గర చాలా మంది బేరం ఆడతారు కదా దాన్ని ఉద్దేశించి ఈమె ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.



Similar News